NLR: ఇందుకూరుపేట మండలం నరసాపురం అంగన్వాడీ కేంద్రంలో సోమవారం 'అంగన్వాడీ పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య ఉంటుందని సూపర్వైజర్ మంజుల తెలియజేశారు.
కాన్వెంట్లకు దీటుగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

