MBNR: బాలానగర్, నందారం గ్రామాలలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మహిళా వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 'అమ్మకు అక్షరమాల' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
మహిళలు తప్పనిసరిగా చదువు నేర్చుకోవాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. ఈ అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో స్థానిక మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

