BPT: జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజులు జిల్లాలో వర్ష సూచన లేదు. కానీ, ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరనుంది. సుమారు 20 మండలాలు డేంజర్ కేటగిరీలో (41°C - 54°C) ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
బాపట్ల, చీరాల, వేమూరు, రేపల్లె, పర్చూరు, కారంచేడు సహా మొత్తం 20 మండలాల్లో ఎండలు మండిపోనున్నాయి.

