SKLM: ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.

