BPT: బల్లికురవ మండలంలో నకిలీ ఏసీబీ అధికారి వీఆర్వోలను బురిడీ కొట్టించాడు. మే 30న ఫోన్ చేసి, అవినీతి కేసులో అరెస్ట్ చేస్తానని బెదిరించాడు. దీనికి భయపడిన ఎలమవారిపాలెం వీఆర్వో యేసయ్య..
బంధువుల ఫోన్ పే ద్వారా రూ.1,50,000 సదరు కేటుగాడికి పంపాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఫిర్యాదు చేయగా, ఎస్సై నాగరాజు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

