భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి సంస్థకు ఉద్యోగుల భద్రత అత్యంత ప్రాధాన్యమని బీహెచ్పీఎల్ ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కేటీకే- 5 భూగర్భ గనిలో బుధవారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గనుల్లో పనిచేసే ఉద్యోగులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

