Banswada: ప్రజా కమిషనర్కు వీడ్కోలు ఆర్మూర్కు బదిలీ అయిన శ్రీహరి రాజు
బాన్సువాడ: మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు బదిలీ పై ఆర్మూర్ మున్సిపాలిటీకి బదిలీ అయి వాళ్ళుచున్న సందర్భంగా వారికి సిబ్బంది ఆత్మీయ వీడుకోలు సభను ఏర్పాటు చేసి,ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ,కమీషనర్ గా కాలం లో సిబ్బంది సహకారం తో ప్రజల సమస్యల పై వెంటనే స్పందించే వారని,వచ్చే వారికి సరైన సమాధానం ఇచ్చి,వారికి పని చేసి పెట్టే వారని పొగడారు.అనంతరం బదిలీ పై వెళ్ళుచున్న కమిషనర్ శ్రీహరి రాజు మాట్లాడుతూ,తాను పని చేసిన రెండు సంవత్సరాలు సిబ్బంది తమకు సహకరించి మంచి పేరు తెచ్చినందుకు ఆయన వారందరికీ కృతఙ్ఞతలు తెలిపారు.

