Bhumpally : బొప్పాపూర్ మత్స్య సంఘం చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం!
భూంపల్లి: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
సంఘం చైర్మన్ గా పర్స శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పర్స ఎల్లం, కార్యదర్శిగా పర్స శంకర్ ఎన్నిక కాగా, డైరెక్టర్లుగా అరిగే కృష్ణ, దమ్మల శేఖర్, అరిగే యాదగిరి, పర్స నాగభూషణం, ఎల్లమ్మల బాలయ్య, ఉస్కే కిషన్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులను బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి మరియు మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

