Chirala: చీరాలలో పండ్ల దుకాణాలపై అధికారుల దాడులు
Chirala: బాపట్ల జిల్లా చీరాలలో పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. మామిడి, యాపిల్, దానిమ్మ, జామ, అరటి పండ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అన్నీ పండ్ల శాంపిల్స్ సేకరించి.. హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు. వేసవి నేపథ్యంలో ఫ్రూట్స్ కు ఉన్న డిమాండ్ ను అడ్డం పెట్టుకొని త్వరగా పండాలనే ఉద్దేశంతో కెమికల్ వాడుతున్నారనే సమాచారంతో చీరాలలో దాడులు చేపట్టామని అధికారులు తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ లు ఆధారంగా చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ తెలిపారు.

