Dharmavaram: అంగన్వాడీ పత్రాల అందజేత పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా పంపిణీ!
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మల్లేనిపల్లి గ్రామానికి చెందిన పూజారి రజిత అనే మహిళకు అంగన్వాడీ ఆయాగా నియామక పత్రాన్ని ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అందజేశారు.
అంగన్వాడి ఆయాగా ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని శ్రీరామ్ సూచించారు.అనంతరం శ్రీరామ్ కు రజిత ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి మల్లేనిపల్లి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

