గిద్దలూరు: పట్టణంలోని తిరుమల కన్వర్షన్ హాల్ లో ఈనెల 3వ తేదీన రైతు సంఘల సమైక్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి గతంలో రైతులకు మేలు చేయాలని రైతు సంఘాల సమైక్యను స్థాపించారు .ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తనయుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ రైతు సంఘల సమైక్యలను ముందుకు తీసుకు వెళ్ళేందుకు కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు.
అందులో భాగంగా రైతు సమస్యలపై పంటల గిట్టుబాటు ధరలపై చర్చించేందుకు గిద్దలూరు నియోజకవర్గ రైతులు ఈ సమావేశానికి తరలిరావాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .ముఖ్యంగా మొక్కజొన్న, పొగాకు, పత్తి తదితర పంటల సమస్యలపై చర్చించేందుకు రైతులు ముందుకు రావాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమాన్ని రైతులందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

