Hyderabad: ఏటీఎం ఖాతాదారులారా అలర్ట్.. డబ్బులు రాకపోతే అంతే!
హైదరాబాద్: HYDలోని జూబ్లీహిల్స్ పరిధిలో క్యాష్ ట్రాప్ ముఠా మరోసారి రెచ్చిపోయింది. 15 రోజుల్లోనే వరుసగా మూడు ఘటనలు జరగడంతో ఏటీఎం ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు.
ఏటీఎంల నుంచి డబ్బులు బయటకు రాకుండా నిందితులు స్లాట్ వద్ద ప్లాస్టిక్ కార్డులు అడ్డుగా పెడుతున్నారు. నగదు రాలేదని ఖాతాదారులు వెళ్లిన వెంటనే.. ఆ సొమ్మును కొల్లగొడుతున్నారు. బ్యాంక్ మేనేజర్ల ఫిర్యాదుతో పోలీసులు CCటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

