Ibrahimpatnam: బీటెక్ విద్యార్థినిపై క్లాస్మేట్ అత్యాచారం ఉదయ్ అరెస్ట్
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న తోటి విద్యార్థిని అత్యాచారం చేసిన విద్యార్థి.
క్లాస్మేట్స్ కావడంతో విద్యార్థిని టీ తాగుదాం అని చెప్పి దిల్షుక్నగర్ తీసుకెళ్లిన ఉదయ్ అనే విద్యార్థి, తిరిగి ఇబ్రహీంపట్నం వచ్చే సమయంలో ఒక మద్యం షాపు వద్ద మద్యం తీసుకొని రాత్రి సమయంలో బిడిఎల్ ప్రాంతానికి తీసుకెళ్ళి మద్యం తాగించి అత్యాచారం చేశారని తెలిపిన డిసిపి నారాయణరెడ్డి.
ఉదయం సమయంలో అమ్మాయి నిద్రమత్తునుండి తెరుకొని తనపై అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది, అనంతరం కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా అమ్మాయిపై అత్యాచారం చేసినట్లుగా నిర్ధారించారన్నారు ఉడుతల ఉదయ్ పై కేసు నమోదు చేసి ఉదయ్ అనే విద్యార్థిని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారని తెలిపిన మహేశ్వరం డిసిపి నారాయణరెడ్డి.

