Ichapuram: పట్టణంలో పక్కదారి పడుతున్న గ్యాస్ సరఫరా
Ichapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ఇచ్ఛాపురం తహసిల్దార్ కు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి కోరారు.
ఈ సందర్భంగా బుధవారం తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.
ఇచ్ఛాపురం పట్టణంలో గ్యాస్ సరఫరా పక్కదారి పడుతుందని శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయని తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాలకు గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్తు నరేంద్ర యాదవ్, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

