Jangaon: వడ్లకొండ ఐకేపీ కేంద్రంలో రైతుల రాస్తారోకో
Jangaon: జనగామ మండలం వడ్లకొండ IKP కేంద్రంలో ధాన్యం అన్లోడ్ కాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. కేంద్రానికి కేటాయించిన వీరభద్ర రైస్ మిల్లులో లారీలు ఖాళీ కాకపోవడంతో సుమారు 160 కుప్పల ధాన్యం నిలిచిపోయిందని, వర్షాలకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
'మాకు వీరభద్ర మిల్లు వద్దు' అంటూ రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో ఓ రైతు ఆవేదనతో అక్కడికి వచ్చిన CI కాళ్లపై పడి వేడుకోవడం అందరినీ కదిలిచింది.

