Kadiri: పేలుడు ఘటన బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే వెంకటప్రసాద్ భరోసా
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో రెండు నెలల క్రితం జరిగిన పేలుడు సంఘటనలో కాపాడడానికి వెళ్ళి మృత్యు బారిన పడిన నలుగురి భాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించిన 20 లక్షల పరిహారాన్ని ఒకొక్క కుటుంబానికి 5లక్షల చొప్పున కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ అందజేశారు.
పేలుడు సంభవించి సహాయం చేయడానికి వెళ్లి నలుగురు చనిపోవడం చాలా దురదృష్టమైన సంఘటన అని,భాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.

