Kodumur: మంత్రి పర్యటనలోనే మైనింగ్ మాఫియా దందా.. కోడుమూరులో ఘోరం!
Kodumur: కోడుమూరు మండలం బైoదొడ్డి గ్రామంలో బరితెగించిన ఎర్రమట్టి మాఫియా .యథేచ్ఛగా బైన్ దొడ్డి తిప్ప నుండి ట్రిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్న మాఫియా హిటాచితో తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులు సగానికి పైగా తిప్పను తవ్వేసిన మాఫియా.
పట్టించుకోని మైనింగ్ , పోలీస్ ,రెవెన్యూ అధికారులు. మైనింగ్ మినిస్టర్ కొల్లురవీంద్ర కోడుమూరు నియోజకవర్గంలో పర్యటిస్తుండగా యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు.ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వుకొని డబ్బులు సంపాదించుకోవడం పై గ్రామ ప్రజలు విస్తు పోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు ఇంకానేనైనా స్పందిస్తారా అంటున్న ప్రజలు.

