Dailyhunt
Kolimigundla: జేసీబీ ఎక్కి కాలువ పూడిక తీసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Kolimigundla: జేసీబీ ఎక్కి కాలువ పూడిక తీసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

hmtv 1 week ago

Kolimigundla: జేసీబీ ఎక్కి కాలువ పూడిక తీసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమంతు గుండం చెరువు వద్ద నిర్వహించిన జలధార..

జలరతి కార్యక్రమంలో పాల్గొన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా సొంత నిధులతో చెరువుకు సంబంధించిన 22 కి.మీ. పొడువునా కాలువ పూడికతీత పనులు ప్రారంభించిన మంత్రిజెసిబి వాహనం నడిపి కాలువలో మట్టిని స్వయంగా తీసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనంతరం కాలువ గట్టు వెంబడి నడిచి, కాలువ పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు జలధార - జల హారతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తుంది.

హనుమంత గుండం చెరువు నుంచి దాదాపు 23 కిలోమీటర్లు కాలువ పొడవునా, ఉన్న 5 చెరువుల్లో, వాగులు, వంకల్లో మట్టి పూడికతీత పనులను సొంత నిధులతో చేపట్టాం 3 మీటర్ల లోపు భూగర్భ జలాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. భూగర్భ జలాలు పెరిగితే రైతులంతా తమ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకునే వీలుంటుంది వారం రోజుల్లో ఈ 23 కిలోమీటర్ల కాలువలో పూడికతీత పనులు పూర్తి చేస్తాం దాదాపు 17 జెసిబిలతో వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నీరు వృధాగా పోకూడదని, ప్రతి నీటిబొట్టును ఒడిచిపట్టుకుని సముద్రం మాదిరి భూగర్భ జలాలు పంచే ప్రయత్నం చేస్తున్నాం 23 కిలోమీటర్ల కాల్వ పొడవున జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు ఐదు చెరువుల్లో మట్టి పూడికతీత పనులు చేపట్టనున్నము.

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెరువులు, కాలువల్లో పూడికతీత కార్యక్రమంలో భాగంగా మట్టిని అవసరమైన రైతులు తీసుకు వెళ్లే విధంగా వెసులుబాటు కల్పించనున్నాము మట్టిని తీసుకెళ్లే రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తాము ఎవరైనా మట్టిని తీసుకెళ్లే క్రమంలో అడ్డుకుంటే.. రైతులు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం సారవంతమైన మట్టిని రైతులు వినియోగించుకోవడం ద్వారా పంట ఉత్పత్తి మరింత పెరుగుతుంది కూటమి ప్రభుత్వంలో జలహారతి - జలధార కార్యక్రమాన్ని ఒక యజ్ఞం మాదిరి చేస్తున్నాం నంద్యాల జిల్లాలోనే బనగానపల్లి నియోజకవర్గంలో ముందుండేలా కృషి చేద్దాం రైతులు, ప్రజలు అందరూ సహకరించి సమన్వయంతో పని చేస్తే ఇది మరింత విజయం అంతమవుతుంది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu