Dailyhunt
Machilipatnam: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. చివరకు విషాదం

Machilipatnam: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. చివరకు విషాదం

hmtv 1 week ago

Machilipatnam: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. చివరకు విషాదం

Machilipatnam Instagram Love Tragedy: సోషల్ మీడియా వేదికగా ఏర్పడే పరిచయాలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ఓ ప్రేమకథ చివరకు యువతి ఆత్మహత్యతో ముగిసిన విషాద ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేటలో చోటుచేసుకుంది.

అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. గొడుగుపేటకు చెందిన రాగశ్రీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లీలా కుమార్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొంతకాలం ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్నారు. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి లీలా కుమార్ అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.

రూ. 5 లక్షల కట్నం డిమాండ్:

రాగశ్రీని పెళ్లి చేసుకోవాలంటే రూ. 5 లక్షల కట్నం ఇవ్వాలని, లేదంటే పెళ్లి చేసుకోనని లీలా కుమార్ తెగేసి చెప్పాడు. దీనికి తోడు అతని తల్లి కూడా కట్నం తెస్తేనే ఇంటి కోడలిగా ఒప్పుకుంటామని ఒత్తిడి తెచ్చింది. నమ్మి ప్రేమించిన వ్యక్తి కట్నం కోసం వేధించడంతో రాగశ్రీ తీవ్ర మనస్థాపానికి గురైంది. తన జీవితం నాశనమైందన్న బాధతో ఆత్మహత్యే శరణ్యమని భావించింది.

చికిత్స పొందుతూ మృతి:

చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసిన రాగశ్రీ, ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మచిలీపట్నం ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో రాగశ్రీ ప్రాణాలు విడిచింది.

కేసు నమోదు - దర్యాప్తు:

మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనుకుదురు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు లీలా కుమార్ మరియు అతని తల్లిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని, అవి చివరికి ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తాయని పోలీసులు యువతను హెచ్చరిస్తున్నారు. రాగశ్రీ మృతితో గొడుగుపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu