Medak: మెదక్ దాయార పురాతన కట్టడాలను పరిశీలించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్: పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం మెదక్ దాయార పురాతన కట్టడాలైన బావి, దేవాలయాలు సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ , అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మెదక్ ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు యువత,ఇతర ప్రజాప్రతినిధులు.
గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని పర్యాటక శోభ సంతరించే విధంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుది రూపు తీసుకువచ్చే విధంగా పర్యాటక పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో మౌలిక వసతులు కల్పనపై పటిష్ట చర్యలు తీసుకుంటామని.ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.

