Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nakrekal: అన్నదాతలతో ముఖాముఖి.. వేముల వీరేశం భరోసా

Nakrekal: అన్నదాతలతో ముఖాముఖి.. వేముల వీరేశం భరోసా

hmtv 3 weeks ago

Nakrekal: అన్నదాతలతో ముఖాముఖి.. వేముల వీరేశం భరోసా

Nakrekal: ​వ్యవసాయం పండుగలా సాగాలని, కర్షకుడి కళ్లలో ఆనందం చూసినప్పుడే రాజ్యానికి అసలైన వికాసం లభిస్తుందని నకిరేకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు.

స్థానిక రైతు వేదికలో నిర్వహించిన 'రైతు వార్షికోత్సవం'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ముఖాముఖి నిర్వహించి, వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. "రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల పక్షపాతి. రైతు భరోసా నుంచి ఉచిత విద్యుత్ వరకు, పంట బీమా నుంచి గిట్టుబాటు ధర కల్పన వరకు ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది" అని స్పష్టం చేశారు. దళారీ వ్యవస్థను రూపుమాపి, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత తెచ్చామని, రైతులు ఎక్కడా అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.ముఖ్యంగా సాగునీరు, విత్తనాలు, ఎరువుల లభ్యతపై రైతులు లేవనెత్తిన పలు అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు.

క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతు గొంతుకను ప్రభుత్వం వింటుందని, వ్యవసాయ రంగం సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వీరేశం పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు మరియు పెద్ద సంఖ్యలో అన్నదాతలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu