Nandyal: ఆసుపత్రిలో స్వయంగా చెత్తను క్లీన్ చేసిన మంత్రి
Nandyal: సంజామల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సంజామల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ఆసుపత్రి పరిసరాలు, వార్డులను ప్రత్యేకంగా పరిశీలించిన మంత్రి. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్న మంత్రి.
ఆసుపత్రిలో రోగుల వార్డులో అపరిశుభ్రంగా చెత్త పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. స్వయంగా చెత్తను క్లీన్ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అనారోగ్యం బారిన పడిన ప్రజలు ఆరోగ్యం కోసం వచ్చే ఆసుపత్రిని మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

