నెల్లూరు: రాంజీనగర్ వైఎస్సార్సీపీ సిటీ ఆఫీస్లో డివిజన్ ఇన్చార్జ్లు, కార్పొరేటర్లతో వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, నాయకులకు సూచించారు. వెరిఫికేషన్ను నిర్దేశిత సమయంలో పూర్తి చేసినప్పుడే ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తింపు కార్డు అందుతుందని తెలిపారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న SIR సర్వేపై అప్రమత్తంగా ఉండి, పార్టీ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎవరి ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. BLAల జాబితాను కూడా త్వరితగతిన సిద్ధం చేయాలని నాయకులకు తెలియచేశారు.

