Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PALASA: ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక - ప్రజాదర్బార్ నిర్వహణ

PALASA: ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక - ప్రజాదర్బార్ నిర్వహణ

hmtv 1 week ago

PALASA: నియోజకవర్గ స్థానిక శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన "ప్రజా పరిష్కార వేదిక - ప్రజా దర్బార్" కార్యక్రమం అధికారికంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హాజరై తమ సమస్యలను శాసనసభ్యురాలికి వినిపించారు. ముఖ్యంగా పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర సమస్యలకు సంబంధించిన 21 మంది వినతిపత్రాలను సమర్పించారు.

శాసనసభ్యురాలు ప్రజల వినతులను శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండటం తమ ప్రధాన బాధ్యత అని, ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేయడం ద్వారా వేగవంతమైన పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu