Pamidi: పామిడిలో భక్తి చాటుకున్న సామాన్య కార్మికుడు!
పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని భావసారా క్షత్రియ డబ్బిదార్ ఫిర్కా వారు నూతనంగా నిర్మించిన రుక్మిణి సమేత పాండురంగస్వామి దేవాలయం లోని పాండురంగస్వామి స్వామి కి వెండిపాదాలు తయారు చేయుంచి మహేంద్రకర్ ప్రవీణ్ కుమార్ అందించారు.
పామిడి లోస్త్రీల నైటీలు తయారు చేయు పేద కార్మికుడునిగా పనిచేస్తారు.
తాను సంపాదించి దాచుకున్న లక్ష రూపాయలు డబ్బు భగవంతుని సేవకు ఖర్చు చేయాలన్న సంకల్పం మనసులో వెలిసింది. వెంటనే కొత్త విగ్రహానికి కొత్త వెండి పాదాలు చేయుంచాలని సంకల్పం తో తల్లి సక్కు బాయి కి తెలిపారు. ఆమెకూడ సమ్మతి తెలపడం తో లక్ష రూపాయల వ్యయం తో పాదాలు తయారు చేయుంచి ఆలయ అధ్యక్షులు జె. శ్రీనివాస రావు కు అందించారు.

