Dailyhunt
Pebbair: ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న పెబ్బేరు.. రేపే ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

Pebbair: ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న పెబ్బేరు.. రేపే ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

hmtv 3 weeks ago

Pebbair: ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న పెబ్బేరు.. రేపే ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

Pebbair: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని శ్రీ మిట్ట ఆంజనేయస్వామి దేవాలయంలో జరుగుతున్న ధ్వజస్థంభ, నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి.

మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన సామూహిక హోమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య 80కు పైగా దంపతులు ఒకేసారి హోమంలో కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమకుండాల నుంచి ఎగిసిన పవిత్ర అగ్నిజ్వాలలు, ఘంటానాదాలు, వేదఘోషల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.

ఈ హోమాల్లో పాల్గొన్న భక్తులు కుటుంబ శ్రేయస్సు, ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు సముచిత ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, మహోత్సవాల్లో భాగంగా మరిన్ని ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు కొనసాగనున్నాయని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.

మొత్తంగా రెండవ రోజు సామూహిక హోమాలు భక్తి భావాన్ని మరింత పెంచుతూ, మహోత్సవాలకు ప్రత్యేక శోభను తెచ్చాయి. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. రేపు జరగబోయే ప్రతిష్ట మహోత్సవానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి , పట్టణ ప్రముఖులు, హిందూ ధార్మిక నిర్వాహకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu