
ప్రకాశం జిల్లా: కొరిసపాడు మండలం పిచికల గుడిపాడు గ్రామంలో కలెక్టర్ రాజాబాబు, శుక్రవారం రాత్రి గ్రామ సచివాలయంలోనే నిద్రించారు శనివారం ఉదయం వేకువజామునే ప్రజల చెంతకు చేరి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఉపాధి హామీ పనులను తనిఖీ చేసి, ఉపాధి హామీ వర్కర్లతో కలిసి మాట్లాడారు .అనంతరం గ్రామంలో ని ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణ ను పరిశీలించారు. గ్రామస్తులతో మమేకమై పారిశుధ్య ధ్య నిర్వహణ గురించి వివరించారు .ఎలా వేరు వేరు చేయటం దానిని స్వచ్ఛరథం వాహనం ద్వారా ఎలా వినియోగించుకోవాలని అనే విషయాన్ని వారికి అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ రాజాబాబు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట గ్రామస్తులతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
