Shamshabad: శంషాబాద్ మండల పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది
శంషాబాద్: ఈనెల 13వ తేదీన కూతురు పెళ్లి ఘనంగా నిర్వహించిన మరుసటి రోజే గుండెపోటుతో పెళ్లికూతురు తండ్రి కే సురేందర్ మృతి చెందాడు.
ఈ ఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం గ్రామంలో ఈ ఘటన జరిగింది. గత వారం రోజుల క్రితం సురేందర్ కు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రిలో స్టంట్ వేశారు. సురేందర్ అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకోకుండానే కూతురు పెళ్లి పనులను బిజీగా ఉండడంతో హార్ట్ ఎటాక్ వచ్చిందని సమాచారం. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు.

