Shayampet: శాయంపేటలో హనుమాన్ విగ్రహం ముక్కలు చేయడం దుర్మార్గం..
శాయంపేట: శాయంపేట లో ధ్వంసానికి గురైన హనుమాన్ ఆలయ ప్రదేశాన్ని సందర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ధర్మాన్ని కాపాడాల్సిన వారు, ప్రజల మనోభావాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు.
హన్మకొండ పేరే ఆ హనుమంతుడి పేరు మీద ఉంటే అదే హన్మకొండలో హనుమంతుడికి అపచారం జరగడం, అత్యంత కిరాతకంగా విగ్రహాన్ని ముక్కలు చేయడం హన్మకొండకే కీడు అన్నారు. ఈ కీడు పోవాలంటే ఇక్కడ పాప పశ్చాత్తమం కోసం శాంతి హోమం నిర్వహించి ప్రభుత్వమే విగ్రహ పునః ప్రతిష్ఠాపన చేయాలి అని డిమాండ్ చేశారు. దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పూర్తిగా అధర్మ షాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు.

