Tamsi: కలెక్టర్ మార్క్ పాలన రంగంలోకి లారీలు.. జొన్న రైతుల్లో ఆనందం
తాంసి: అదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డును సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజర్సీషా జొన్న కొనుగోలులో జరుగుతున్న జాప్యం పై రైతులు విన్నవించగా, 24 గంటల్లోపు తూకం జరిపించడంతోపాటు, కొనుగోలు చేసిన జున్ను బస్తాలను వెంటనే గోడౌన్ కు తరలిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో.
ఇప్పటికే కొనుగోలు చేసిన 20వేల క్వింటాళ్ల పైగా జొన్నలను మార్కెట్ గోడౌన్ కు తరలించే ఏర్పాట్లు చేసి ఇచ్చిన మాట ప్రకారం 10 లారీలను అందుబాటులోకి తేవడంతో వారం రోజులుగా నిరీక్షిస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

