Yellandu: కేంద్ర మంత్రి కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలి ప్రజాసంఘాల డిమాండ్
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం సెంటర్ లో శుక్రవారం సిపిఐఎంల్ ప్రజాపంథా ప్రజాసంఘాల(PDSU ,PYL,POW,TUCI, అరుణోదయ) ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో బండి సాయి భగీరథ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ మైనర్ బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసినా నేటిగా అరెస్టు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని నాయకులు ఆరోపించారు. తక్షణమే బండి సంజయ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నుండి భర్తరఫ్ చేసి బండి సాయి భగీరథను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

