Yemmiganur: స్వర్ణకారుల రోడ్డు రోల్లా.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నిరసన
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బంగారు ఆభరణాల తయారీ కార్మికులు ఆందోళన దిగారు.
బంగారు కొనడం పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర సంఘం పిలుపుతో బంద్ పాటిస్తూన్నారు. శరాఫ్ బజార్ లో ర్యాలీ నిర్వహించారు.నోట్ల రద్దు,కరోనా సమయంలో భారీగా నష్టపోయామని రెడీమేడ్ ఆభరణాల వల్లా ఉపాధి తగ్గిందని ఈ నేపథ్యంలో ప్రధాని ఏడాది పాటు బంగారు కొనవద్దు అనడం సరికాదన్నారు.తమ ఉపాధికి భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డికి వాట్స్ అప్ ద్వారా వినతిపత్రం పంపారు.

