అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో గోకులం గోపాలన్ నిర్మాతగా రొజిన్ థామస్ తెరకెక్కించిన 'కథనార్' ట్రైలర్ విడుదల
గోకులం మూవీస్ బ్యానర్ మీద గోకులం గోపాలన్ నిర్మాతగా రొజిన్ థామస్ తెరకెక్కించిన చిత్రం 'కథనార్'.
ఈ సినిమాలో జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా, సనూప్ సాన్ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు.
'విజ్ఞానం యొక్క రూపం మూలం ఎలా ఉన్నా కూడా.. కాంతూర్ శాలయలో దాన్ని ఆహ్వానిస్తారు.. ఇంద్రజాలాన్ని నేను నమ్మను.. అవగాహనతో రహస్య మార్గాలలో వాళ్లు దాన్ని పరిశోధిస్తున్నారు.. ఎవరి ఊహకి అందని.. అందరూ ఆశ్చర్యంతో చూసే ఒక మాయా జాలం.. మన ఆత్మతో కలిసి మన జ్ఞాపకాలతో ఐక్యం కాబోయే ఒక సంఘటన.. చేర మహారాజుకి కుంచమున్ తరుపున శుభాకాంక్షలు'.. 'చూసినది విన్నది ఏదీ రాదు.. వచ్చేది ఒక్కటే.. ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అగ్ని ఒక్కటే'.. 'కరం కలిస్తే ఆప్యాయిత.. కరం వెడిస్తే నాశనమే బలం'.. 'ఒక శరీరాన్ని అదుపు చేసే ఎక్కువ శక్తిని మీరు నియంత్రించగలిగారు.. ఎలాగా?'.. 'మేం చెప్పేది నమ్మండి. వేనాడు ఆపదలో ఉంది'.. 'మాయ.. ప్రపంచమే మాయ' అంటూ సాగిన డైలాగ్స్తో ట్రైలర్ అద్భుతంగా ఉంది.

