Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అకాల వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అకాల వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

` ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలు ` వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి
` కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

` రైతులు నష్టపోకుండా ఉండేలా అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి
` అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్(జనంసాక్షి):అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 14.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.2001.96 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. రానున్న 3 నుంచి 4 రోజుల పాటు అకాల వర్షాలు పడే అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులు, వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నల్గొండ, నిజామాబాద్ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైనన్ని తార్పాలిన్లు (పాలీథిన్ కవర్లు) సిద్ధంగా ఉంచాలి. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేలా అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి' అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi