ఏటూరు నాగారంఏప్రిల్ 30 (జనం సాక్షి).
ఏటూరు నాగారం మండలం లోని ముళ్ళకట్ట గ్రామ పంచాయితీ, రాంపూర్ గ్రామం లో త్రాగు నీటి పంపు చెడిపోయిన వెంటనే మెకానిక్ నీ పిలిపించి ఈ బోర్ పై ఆధారపడి, జీవిస్తున్న కుటుంబాలకు మంచి నీటి సమస్య ఉండకూడదని రిపేర్ చేపించి ప్రజలకు త్రాగునీటి కష్టాలు లేకుంట చేసిన ముళ్ళకట్ట సర్పంచ్ ఈసం జనార్దన్ కు, గ్రామస్తుల కష్ట సుఖాల్లో, వెన్నంటే ఉన్నందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

