నల్లగొండ,మే 18,(జనం సాక్షి):తెలంగాణ ఎస్సెట్ ఫలితాల్లో నల్లగొండకు చెందిన గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి జిల్లాకు మరోసారి గౌరవం తీసుకొచ్చారు.
ఇంజనీరింగ్ విభాగంలో పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి మెరుగైన ర్యాంకులను కైవసం చేసుకోవడంతో కళాశాలలో ఆనంద వాతావరణం నెలకొంది.
విద్యార్థుల్లో సాత్విక్ రెడ్డి 873 ర్యాంకు, సోమేశ్వరి 929, వైష్ణవి కె 954, మలీహ తస్నీమ్ 1361, సౌమ్య కె 2026, అనుఘ్న శ్రీయం 2643, బి. మధుప్రియ 3267, తితీక్ష్య వై 3280, హీబా మైరుక్ 3292, మదీహ తస్నీమ్ 3663, బుప్రా 4424, జి. శివ 5916, సింధూజ జి 6163, అజిజుర్ రహమాన్ 7339, నీరజ్ నారాయణ 9267, స్రావ్య పి 9384, అయాన్ యండి 9620, లహరిక కె 10781, హేమ చందర్ 10795, అస్రిత జి 11271, సాయి ప్రణీత్ రెడ్డి 11970, శ్రీహన్ సంతోష్ రెడ్డి బి 13042, తేజితా కె 13289, మేఘన యం 13345, భానుమతి కె 14459, అను డి 14565, అమూల్య కె 14745, సాయి హర్ష ఎస్ 15300, నాగ సంజన వి 15502, రాకేష్ కె 17428, లహరి యం 17706, తేజస్వినీ ఎన్ 17944, సిరి ఎం 18623, ఆఫియా నాజ్ 18838, శివ దీక్షిత ఎం 19000, సుష్య ఇ 19118, యోగితా రాజ్ పై 19256 ర్యాంకులు సాధించారు.
విద్యార్థుల ఈ ఘన విజయంపై కళాశాల యాజమాన్యం కాసర్ల వెంకట్ రెడ్డి, చల్లా వెంకట రమణ, కొమ్మిడి రఘుపాల్ రెడ్డి, పుట్టా వెంకట రమణారెడ్డి అభినందనలు తెలిపారు. క్రమశిక్షణతో చదువుతూ విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలు గౌతమి కళాశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.

