అవనిగడ్డ: అవనిగడ్డలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్తో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు జట్టు భావన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఇటువంటి పోటీలు గ్రామీణ ప్రాంత యువతకు తమ ప్రతిభను చాటుకునే మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు.
పోటీల ప్రారంభ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు.

