న్యూ ఢిల్లీ: బ్రిక్స్ (BRICS) అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ప్రతినిధులకు పూర్తిగా శాకాహార విందు (Pure Veg Dinner) ఏర్పాటు చేయడం పై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్ష విమర్శలు గుప్పించారు.
మన దేశంలో దాదాపు 80 శాతం మంది మాంసాహారాన్ని ఇష్టపడతారని, అంతర్జాతీయ వేదికల పై భారతీయ విభిన్న ఆహార సంస్కృతిని ప్రతిబింబించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో లభించే నాన్-వెజ్ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని, విదేశీ ప్రతినిధులకు భారతీయ వైవిధ్యాన్ని పరిచయం చేయడంలో ఈ నిర్ణయం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ప్యూర్ వెజ్ డిన్నర్ నిబంధనపై ప్రతిపక్ష నాయకులు కూడా పెదవి విరుస్తూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.

