రియాద్: హజ్ అనుమతులు లేకుండా 13 మంది యాత్రికులను మక్కాకు తరలించడం ద్వారా హజ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, నలుగురు ప్రవాసులకు మరియు ముగ్గురు సౌదీ పౌరులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది.
మక్కా ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా దళాలు వారిని పట్టుకున్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హజ్ నిబంధనలు ఉల్లంఘించిన ఎవరికైనా SR100,000 వరకు జరిమానాలు, జైలు శిక్ష విధిస్తారని హెచ్చరించింది.
అనుమతి లేకుండా హజ్ యాత్ర చేసేందుకు ప్రయత్నించేవారికి 20,000 సౌదీ రియాల్స్ వరకు జరిమానాలు విధిస్తారు. ప్రవాసులను దేశం నుండి బహిష్కరించడంతోపాటు శిక్షాకాలం పూర్తయ్యాక తిరిగి ప్రవేశించకుండా 10 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తారని అధికారులు తెలిపారు. దీంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిని రవాణా చేయడానికి ఉపయోగించిన వాహనాలను జప్తు చేస్తారని హెచ్చరించింది. హజ్ నిబంధనలు మరియు సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ పౌరులు మరియు నివాసితులందరికీ మరోసారి పిలుపునిచ్చింది.

