కువైట్ః జలీబ్ అల్ షువైఖ్ ప్రాంతంలోని బుధవారం మధ్యాహ్నం ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించిన దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, విజయవంతంగా నియంత్రించాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. ప్రమాదంపై దర్యాప్తు కోసం ఘటనా స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది. ఇలాంటి విషాద సంఘటనలను నివారించడానికి పౌరులు, నివాసితులు భద్రతా, ఫైర్ సేఫ్టీ రూల్స్ ను పాటించాలని అధికారులు కోరారు.

