సింగపూర్: సింగపూర్ మానవ వనరుల శాఖ (Ministry of Manpower) ఉన్నతాధికారులతో ఖతార్ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ అలీ బిన్ సమీఖ్ అల్ మర్రి సమావేశమయ్యారు.
ఈ సమావేశాలలో ఖతార్ మరియు సింగపూర్ దేశాల మధ్య కార్మిక రంగంలో ఉన్న సహకారాన్ని సమీక్షించారు. ఉపాధి, నేషనల్ పాలసీలు మరియు రెగ్యూలేటరీ ఫ్రేమ్ వర్క్, వర్క్ ఫోర్స్ ట్రైనింగ్, నైపుణ్యాభివృద్ధి, అలాగే సామాజిక రక్షణ వంటి అంశాలపై చర్చించారు.
రెండు దేశాల మధ్య కుదిరిన కార్మిక సహకార ఒప్పందంపై కూడా చర్చించారు. అదే సమయంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే దిశగా ఆ ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన విధానాలను పరిశీలించారు.
అలాగే, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సర్వీసెస్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ మరియు సాంకేతిక పరిష్కారాలలో ప్రత్యేకత కలిగిన ప్రముఖ సంస్థ 'సెర్టిస్ గ్రూప్' (Certis Group)ను డాక్టర్ అలీ బిన్ సమీఖ్ అల్ మర్రి సందర్శించారు. 1958లో సింగపూర్ పోలీస్ ఫోర్స్ 'గార్డ్ మరియు ఎస్కార్ట్ యూనిట్'గా ప్రారంభమైన ఈ సంస్థ, తదనంతరం సింగపూర్ సార్వభౌమ సంపద నిధి (sovereign wealth fund) పూర్తి యాజమాన్యంలోని వాణిజ్య సంస్థగా మారింది.
మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ మరియు ఈ రంగంలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో ఆ సంస్థకున్న నైపుణ్యం నుండి ప్రయోజనం పొందే అవకాశాలను ఆయన పరిశీలించారు.

