Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్

లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్

maa gulf 4 days ago

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి.ఆనంద్, ఐపీఎస్, మరియు హోం శాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, ఐపీఎస్, ఈరోజు రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.

లోక్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర భద్రతా పరిస్థితులు, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలీసు శాఖ పనితీరు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రజల భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు మరియు పరిపాలనా అంశాలపై కూడా వారు గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ చేస్తున్న సేవలను అభినందించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి కొనసాగించాలని సూచించారు.సమావేశం సౌహార్ద వాతావరణంలో ముగిసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu