దోహా: ఖతార్ లో ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ.. 'జాతీయ తేనెటీగలు, తేనె ప్రాజెక్టు: సుస్థిర వ్యవసాయం దిశగా ఒక భాగస్వామ్యం' అనే కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
మే 19న విల్లాజియో మాల్లోని గేట్ 4 వద్ద ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరగనుంది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడం, ఖతార్ దేశంలో తేనెటీగల పెంపకం మరియు తేనె ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా జరుగుతున్న కృషిని వివరించడంతోపాటు స్థానికంగా లభించే తేనె విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వశాఖ తన సోషల్ మీడియా ప్రకటనలో తెలిపింది.

