కేరళ: దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థికవ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు మే 26న కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి.
కానీ ఈసారి ఐదు రోజుల ముందే కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ శుక్రవారం వెల్లడించింది. దేశంలో 50 శాతానికి పైగా సాగుభూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి.

