మస్కట్: ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని, మే నెల వేతనాలను మే 25 లోపు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రైవేటు రంగ సంస్థలను ఆదేశించింది.
ఈద్ అల్-అదా పండుగను పురస్కరించుకొని కార్మిక చట్ట నిబంధనలకు లోబడి పనిచేస్తున్న ప్రైవేటు రంగ సంస్థలన్నింటికి ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ఆయా సంస్థలు మే నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాల చెల్లింపు తేదీని ముందుకు జరిపాలని తన సర్కులర్ లో తెలియజేసింది.

