రియాద్: ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గింపుపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. యూఏఈ ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఈజిప్టు విదేశాంగ, అంతర్జాతీయ సహకార మరియు ఈజిప్టు ప్రవాసుల మంత్రి బదర్ అబ్దెలట్టి లో టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రిన్స్ ఫైసల్ మరియు షేక్ అబ్దుల్లా అల్ నహ్యాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దారుణమైన దాడుల నేపథ్యంలో భద్రతా విధానాలను సమీక్షించారు.
ప్రిన్స్ ఫైసల్ మరియు బదర్ అబ్దెలట్టి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. వారు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాలను, అలాగే అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సహా దౌత్యపరమైన పరిష్కారాలకు మద్దతు ఇవ్వడంపై సమీక్షించారు.

