న్యూ ఢిల్లీ: దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18న పోలింగ్ జరగనుండగా..
అదేరోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలకు సంబంధించి జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జూన్ 8వ తేదీ నాటికి చివరి తేదీకాగా.. 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11వరకు గడువు ఉంటుంది.

