హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకనాడు వివక్షతో అల్లాడిన తెలంగాణను పదేళ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా మార్చామని, సకల జనుల సంక్షేమం, సమగ్ర ప్రగతి సాధించి రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలిపామని కేసీఆర్ పేర్కొన్నారు.
అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రస్తుత పాలకులకు ఆయన హితవు పలికారు.

