న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ జడ్జి, తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. లండన్లోని ప్రతిష్ఠాత్మక 'హానరబుల్ సొసైటీ ఆఫ్ ది ఇన్నర్ టెంపుల్' సంస్థ ఆయనను గౌరవ బెంచర్ గా ఎంపిక చేసింది.
600 ఏళ్ల చరిత్ర గల ఈ చారిత్రక సంస్థ.. న్యాయరంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు మాత్రమే ఈ అరుదైన గౌరవాన్ని ఇస్తుంది. దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు జస్టిస్ నాగేశ్వరరావు తెలిపారు.

