దోహా: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలోకి ఉచిత ప్రవేశాన్ని ఖతార్ మ్యూజియంలు ప్రకటించాయి. మే 18న అన్ని వయసుల వారికి ప్రవేశం ఉచితమని తెలిపింది.
ఈ సంవత్సరం వేడుకలను "విడిపోయిన ప్రపంచాన్ని ఏకం చేసే మ్యూజియంలు" అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ఖతార్ జాతీయ మ్యూజియం 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో కళ, సంస్కృతి, కథల ద్వారా ప్రజలను ఏకం చేయడంలో మ్యూజియంలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని అన్నారు. సృజనాత్మకత మరియు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో మ్యూజియంలు పోషించే సాంస్కృతిక మరియు విద్యాపరమైన పాత్రను ప్రముఖంగా చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

